AMARAVATHI

కాంగ్రెస్‌ పార్టీ దిగ్గజ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూత

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ దిగ్గజ నాయకుడు,,మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌(76), శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు..1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్‌ జిల్లా వేల్పూరులో జన్మించారు..నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు..అనంతరం 10 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేశారు..రాజకీయ ప్రస్తానంలో, విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన డి.ఎస్,,NSUI, యువజన కాంగ్రెస్‌లో పనిచేశారు.. తొలిసారిగా 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన శ్రీనివాస్‌. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో గెలుపొందారు.. అనంతరం 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.. 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి,, ఐ అండ్‌ పీఆర్‌ మంత్రిగా, 2004 నుంచి 2008 వరకు ఉన్నతవిద్య, అర్బన్‌ లాండ్‌ సీలింగ్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో అప్పటి టీఆర్‌ఎస్‌తో పోత్తుకుదుర్చుకోవడంలో కీలకపాత్ర పోషించారు..2013 నుంచి 2015 మధ్య ఎమ్మెల్సీగా సేవలందించారు..తెలంగాణ ఆవిర్భావంత తరువాత మండలి విపక్ష నేతగా పనిచేశారు.. రెండవ సారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో 2015లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి,, బీఆర్‌ఎస్‌లో చేరారు..రాష్ట్ర ప్రభుత్వ అంతర్‌ రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు.. 2016 నుంచి 2022 వరకు బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు..కొంతకాలం తరువాత బీఆర్‌ఎస్‌తో విభేదించిన ఆయన తన పదవీ కాలం ముగిసే వరకు పార్టీకి దూరంగా ఉన్నారు.. అనంతరం ఆ పార్టీకి రాజీనామాచేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు..ఇదే సమయంలో అనారోగ్య సమస్యలతో డీఎస్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.. అయనకు భార్య,ఇద్దరు కుమారులు.. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు..రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్.. ప్రస్తుతం బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

రూ.10,20 నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం-ఉత్తర్వులు జారీ చేసిన రిజర్వ్ బ్యాంకు

IPC సెక్షన్ 124A... అమరావతి: ప్రభుత్వం గుర్తించిన 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం…

5 hours ago

ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను పెంచి అందించాం-మంత్రి నారాయణ

నెల్లూరు: ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన మాట ప్రకారం గతంలో ఇస్తున్నరూ.3వేలు పింఛన్‌కు రూ.వెయ్యి పెంచి రూ.4వేలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందించారని,…

5 hours ago

నెల్లూరు గవర్నమెంట్ డాక్టరు జ్యోతిది ఆత్మహత్యేనా ?

డాక్టరు జ్యోతి మరణం వెనుక వున్న కారణం ఏమిటి అనే “నిజం” పోస్టుమార్టం తరువాత వెలుగులోకి వస్తుందా ? లేక…

6 hours ago

ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా పనిచేస్తాను-పవన్ కళ్యాణ్

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో సోమవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో…

7 hours ago

జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న 8,500 ఉద్యోగులు-మంత్రి నారాయణ

జిల్లాలో 313757మంది లబ్ధిదారులకు రూ. 214.50 కోట్లు.. నెల్లూరు: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం తెల్లవారుజామున నుంచి సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం…

1 day ago

రాజకీయ నేతల గుప్పెట్లో క్రీడా సంఘాలు బందీ అయ్యాయి-క్రీడాకారులు

పవన్ కల్యాణ్ హామీ.. అమరావతి: గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్నీ రంగాలూ అథోగతి పాలయ్యాయని, అలాగే క్రీడారంగం సైతం…

1 day ago

This website uses cookies.