AMARAVATHI

భారత్ విశ్వగురు మాత్రమే కాదు,ప్రపంచ యోగా గురువు-ప్రధాని మోదీ

అమరావతి: భారత్ విశ్వగురు మాత్రమే కాదని,,ప్రపంచ యోగా గురువుగా భారత్‌ మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..శుక్రవారం శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సు ఒడ్డున ఉన్న షేర్‌-ఏ-కశ్మీర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ వద్ద జరిగిన అంతర్జాతీయ యోగా దశాబ్ది వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, యోగా ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతున్నదని,,యోగా సాధన వల్ల సకారాత్మక ఆలోచనలు వస్తాయని అలాగే ధ్యానంతో మన ఏకాగ్రత పెరుగుతుందన్నారు..జమ్ముకశ్మీర్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 50 వేల మంది పాల్గొన్నారన్నారు..శ్రీనగర్‌లో ఒక శక్తి ఉందని, యోగా ద్వారా దానిని మరింత పెంచుకోవచ్చన్నారు..

2014లో తొలిసారి తాను అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించానాని,, భారతదేశ ప్రతిపాదనకు 177 దేశాలు మద్దతిచ్చాయని చెప్పారు.. అప్పటి నుంచి యోగా దినోత్సవం సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉందన్నారు..విదేశాల్లో యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని,,యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయన్నారు..జర్మనీలో ప్రస్తుతం కోటిన్నరమంది నిత్యం యోగా చేస్తున్నారని తెలిపారు..యోగా నేర్పే మహిళకు పద్మశ్రీ పురస్కారం కూడా దక్కిందన్నారు..మన దేశంలోని అనేక వర్సిటీలు యోగా కోర్సులు ప్రారంభించాయన్నారు..యోగా ప్రాముఖ్యత గురించి అనేక దేశాల నేతలు తనను అడిగారని వెల్లడించారు..యోగా సాధన వల్ల శారీరకంగా, మానసికంగా మార్పులు వస్తాయన్నారు..నేడు పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కోరుతున్నానని తెలిపారు.. యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచం నలుమూలలా యోగా చేస్తున్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు..అంతకు ముందు ప్రజలతో కలిసి ప్రధాని యోగాసనాలు వేశారు..

Spread the love
venkat seelam

Recent Posts

సీబీఐ కోర్టులో ఉన్న జగన్‌ కేసులను రోజువారీగా విచారించండి-తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసుల పిటిషన్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.. జగన్ కేసులకు…

8 hours ago

తిరుమలలో దళారుల ఏరివేతకు చర్యలు తీసుకోండి – టీటీడీ ఈవో జె.శ్యామలరావు

తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో జె.శ్యామలరావు…

9 hours ago

రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు

నెల్లూరుకు ఒ.ఆనంద్.. అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కలెక్టర్​లను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. శ్రీకాకుళం…

1 day ago

తిరుపతి జిల్లా కలెక్టర్ గా డా.ఎస్. వెంకటేశ్వర్ ఐ.ఎ.ఎస్

తిరుపతి: డైరెక్టర్ సెకండరీ హెల్త్ గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న డా.ఎస్.వెంకటేశ్వర్ ఐ.ఎ.ఎస్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ గా…

1 day ago

రూ.249కి కొత్త ప్లాన్ ప్రవేశ పెట్టిన BSNL

అమరావతి: దేశీయ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ (BSNL) వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఒక కొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది.. దీని…

1 day ago

రూ.10,20 నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం-ఉత్తర్వులు జారీ చేసిన రిజర్వ్ బ్యాంకు

IPC సెక్షన్ 124A... అమరావతి: ప్రభుత్వం గుర్తించిన 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం…

2 days ago

This website uses cookies.