నెల్లూరు: జిల్లాలో ప్రభుత్వ సంస్థ ల్లో పనిచేసే N.M.R & దినసరి ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి S.లవన్న అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో ప్రభుత్వ సంస్థల్లో N.M.R,&దినసరి వేతనాల ఉద్యోగులకు కనీస వేతనాల అమలుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా DRO మాట్లాడుతూ జిల్లాలో 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ సంస్థ ల్లో పనిచేసే N.M.R & దినసరి వేతనాల ఉద్యోగులకు వేతనాలు అమలు చేయడానికి కమిటీ నిర్ణ యించిందన్నారు. నైపుణ్యం లేని ఉద్యోగులకు 560 రూపాయలుగా,అర్ధ నైపుణ్యం కలిగిన వారికి 665 రూపాయలు, నైపుణ్యం కలిగిన వారికి 794 రూపాయలు, ఉన్నత స్థాయినైపుణ్యం కలిగిన వారికి 907 రూపాయలువేతనాలు ఇవ్వాలని కమిటీ నిర్ణయించడం జరిగిందన్నారు. కమిటీ నిర్ణయించిన వేతనాలు 2025 మార్చి నెల వరకు అమలులో ఉంటాయన్నారు.అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తమ శాఖల్లో అమలు చేయాలని ఆయన అన్నారు.ఈ సమావేశంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎం.వెంకటేశ్వరరావు, పంచాయతీ రాజ్ ఎస్.ఇ అశోక్ కుమార్, ఆర్&బి ఎస్.ఇ గంగా రావు,బి. ఎస్.ఎన్. ఎల్ జనరల్ మేనేజర్ హరి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
IPC సెక్షన్ 124A... అమరావతి: ప్రభుత్వం గుర్తించిన 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం…
నెల్లూరు: ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన మాట ప్రకారం గతంలో ఇస్తున్నరూ.3వేలు పింఛన్కు రూ.వెయ్యి పెంచి రూ.4వేలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందించారని,…
డాక్టరు జ్యోతి మరణం వెనుక వున్న కారణం ఏమిటి అనే “నిజం” పోస్టుమార్టం తరువాత వెలుగులోకి వస్తుందా ? లేక…
అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో సోమవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో…
జిల్లాలో 313757మంది లబ్ధిదారులకు రూ. 214.50 కోట్లు.. నెల్లూరు: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం తెల్లవారుజామున నుంచి సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం…
పవన్ కల్యాణ్ హామీ.. అమరావతి: గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లోని అన్నీ రంగాలూ అథోగతి పాలయ్యాయని, అలాగే క్రీడారంగం సైతం…
This website uses cookies.