AMARAVATHIPOLITICS

వయనాడ్‌లో ఓడిపోతే ? రాయ్‌బరేలి నుంచి బరిలోకి దిగిన రాహుల్‌ గాంధీ

అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులపై కొనసాగుతున్న ఉత్కంఠకు శుక్రవారం తెరపడింది..ఆ రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ తాజాగా అభ్యర్థులను ప్రకటించింది..కాంగ్రెస్ పార్టీ యువరాజు,,ప్రస్తుతం కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీ చేసిన రాహుల్‌ గాంధీ,,అక్కడ దెబ్బతింటే రాయ్‌బరేలీ స్థానం కాపాడుతుందేమో అన్న ఆశతో హస్తం పార్ అయన్ను బరిలోకి దింపింది..కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించే అమేథి నియోజకవర్గం నుంచి గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీ లాల్‌ శర్మను రంగంలోకి దించింది.ఈ ఎన్నికల్లో కూడా అమేథి నుంచి ప్రియాంక వాద్రా,,ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా పేర్లు కూడా వినిపించాయి..అనూహ్యంగా చివరి నిమిషంలో కిశోరీ లాల్‌ శర్మను హస్తం పార్టీ రంగంలోకి దించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *