బహిరంగ ప్రదేశాలలో వ్యర్ధాలు వేసే వారిని గుర్తించి హెచ్చరించండి-కమిషనర్ సూర్య తేజ
నెల్లూరు: బహిరంగ ప్రదేశాలలో వ్యర్ధాలు వేసే వారిని గుర్తించి హెచ్చరించాలని మరలా అదే విధంగా ప్రవర్తిస్తే భారీ జరిమానాలు విధించాలని కమిషనర్ సూర్య తేజ మునిసిపాల్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగర పాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలోనే చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే వ్యర్ధాలను అందించాలని కమిషనర్ ప్రజలను కోరారు.పారిశుధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 44వ డివిజన్ పెద్ద బజార్, ముంగమూరి వారి వీధి, బార్కాస్ రోడ్డు, రాయాజీ వీధి, తిప్పరాజు వారి వీధి, శివ ప్రియ హోటల్, కలెక్టరేట్, మహబూబ్ ఖాన్ పార్క్ తదితర ప్రాంతాలలో కమిషనర్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్లపై పార్క్ చేసి ఉన్న నిరుపయోగంగా ఉన్న వాహనాలను గుర్తించి ట్రాఫిక్ పోలీస్ విభాగం వారి దృష్టికి తీసుకెళ్లి ఆయా వాహనాలను వెంటనే రోడ్లపై నుంచి తొలగించేలా చర్యలు చేపట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. చిన్న బజారు ప్రాంతంలోని పాత కూరగాయల మార్కెట్ ప్రాంతంలో పశువుల సంచారాన్ని నియంత్రించేలా గేట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.