AMARAVATHI

తొలి సారి సచివాలయంలోకి అడుగు పెట్టిన ఉపముఖ్యమంత్రి పవన్

పవన్ కళ్యాణ్​కు సీఎం బాబు సాదరంగా స్వాగతం..

అమరావతి: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయానికి చేరుకున్న వెంటనే సెక్రటరీలు, పోలీసు ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు.. సచివాలయంలో అడుగు పెట్టిన వెంటనే పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు..తరువాత సచివాలంలోని తన ఛాంబర్ ను పరిశీలించారు..అటు తరువాత సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును,,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు.. పవన్ కళ్యాణ్​కు సీఎం బాబు సాదరంగా స్వాగతం పలికారు..కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సచివాలయంలో తన ఛాంబర్ కు వచ్చిన పవన్ కళ్యాణ్​ను చంద్రబాబు ఆలింగనం చేసుకున్నారు..పవన్ కళ్యాణ్​తో పాటు సీఎంను మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కలిశారు..సీఎం ఛాంబర్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నం చూపించి మీరు ఆ గుర్తుకు హూందాతనం తెచ్చారని చంద్రబాబును ఉద్దేశించి పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు.. పవన్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు ధన్యావాదాలు తెలిపారు.. ప్రభుత్వ ఏర్పాటు తరువాత తొలి భేటీలో పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది..మంత్రివర్గ సమావేశం ఏర్పాటు, అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం..అదేవిధంగా బుధవారం ఉదయం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోనున్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

నదిలో కొట్టుకుని పోయిన యుద్ద ట్యాంక్,5 గురు సైనికులు మృతి

అమరావతి: చైనా స‌రిహ‌ద్దు ఉన్న న‌దిలో విషాదం చోటుచేసుకున్న‌ది.. యుద్ధ ట్యాంక్(T-72 tank) ఆ న‌దిలో కొట్టుకుపోయింది.. ట్యాంక్ లో…

2 hours ago

కాంగ్రెస్‌ పార్టీ దిగ్గజ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూత

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ దిగ్గజ నాయకుడు,,మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌(76), శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు..1948 సెప్టెంబర్…

9 hours ago

సినీనటుడు అలీ, వృద్దనారీ ప్రతివత అన్న సామెత ?

హైదరాబాద్: వృద్దనారీ ప్రతివత అన్న సామెతను సినీనటుడు అలీ రాగం అందుకున్నాడు...పవన్ కళ్యాన్ పుణ్యం అని చాలా సినీమాల్లో క్యారెక్టర్స్…

22 hours ago

జగన్ అహంతో చేసిన దుస్సాహసమే పోలవరం వినాశనం-చంద్రబాబు

పోలవరంపై శ్వేత పత్రాన్ని విడుదల.. పోలవరం పట్ల జాతి క్షమించరాని నేరానికి పాల్పడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ…

1 day ago

అసదుద్దీన్ ఒవైసీపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాసిన నవనీత్ రాణా

అమరావతి: మహారాష్ట్ర అమరావతి లోకసభ మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా, ఎంపీగా ప్రమాణం చేస్తూ జై పాలస్తీన…

2 days ago

అధికారులపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవు-మంత్రి నారాయ‌ణ‌

నెల్లూరు: ప్రజలకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా టీడీపీ ప్ర‌భుత్వ ప‌రిపాల‌న ఉంటుంద‌ని, అందుకు త‌గిన‌ట్లుగానే అధికారులు పనిచేయాలని రాష్ట్ర పురపాలక,…

2 days ago

This website uses cookies.