తొలి సారి సచివాలయంలోకి అడుగు పెట్టిన ఉపముఖ్యమంత్రి పవన్
పవన్ కళ్యాణ్కు సీఎం బాబు సాదరంగా స్వాగతం..
అమరావతి: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయానికి చేరుకున్న వెంటనే సెక్రటరీలు, పోలీసు ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు.. సచివాలయంలో అడుగు పెట్టిన వెంటనే పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు..తరువాత సచివాలంలోని తన ఛాంబర్ ను పరిశీలించారు..అటు తరువాత సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును,,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు.. పవన్ కళ్యాణ్కు సీఎం బాబు సాదరంగా స్వాగతం పలికారు..కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సచివాలయంలో తన ఛాంబర్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ను చంద్రబాబు ఆలింగనం చేసుకున్నారు..పవన్ కళ్యాణ్తో పాటు సీఎంను మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కలిశారు..సీఎం ఛాంబర్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నం చూపించి మీరు ఆ గుర్తుకు హూందాతనం తెచ్చారని చంద్రబాబును ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.. పవన్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు ధన్యావాదాలు తెలిపారు.. ప్రభుత్వ ఏర్పాటు తరువాత తొలి భేటీలో పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది..మంత్రివర్గ సమావేశం ఏర్పాటు, అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం..అదేవిధంగా బుధవారం ఉదయం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోనున్నారు.