ఎస్ఐపీబీ సమావేశం..
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశం అయింది..ఈసమావేశంలో పలు నిర్ణయాలకు బోర్డు ఆమోదం తెలిపింది..ఇందులో నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో కృషక్ భారతి కో-ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిబ్కో) ఆధ్వర్యంలో రెండు విడతల్లో బయో ఇథనాల్ ప్లాంట్ ల ఏర్పాటు..తోలి విడతగా రూ.560 కోట్లతో 250 కె.ఎల్.డి. సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు. 100 ఎకరాల్లో ఏర్పాటు అయ్యే ప్లాంట్లొ 400 మందికి ఉద్యోగాలు..అంతే కాకుండా మరిన్ని విత్తనశుద్ధి సహా వివిధ ప్రాససింగ్ యూనిట్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది..రాష్ట్రం నుంచి ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2022–27లో మరిన్ని చర్యలు..ప్రస్తుతం జరుగుతున్న ఎగుమతులను 5 సంవత్సరాల్లో రెట్టింపు దిశగా అంటే రూ.3.5 లక్షల కోట్లు ఎగుమతులు సాధించాలని లక్ష్యం..దీంట్లో భాగంగా పలు నిర్ణయాలకు ఎస్ఐపీబీ ఆమోదం..ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రం నుంచి అధికంగా ఆక్వా రంగం నుంచి ఎగుమతులు ఉన్నాయని,,ఆర్బీకేల ద్వారా ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు..దేశంలో మెరైన్ ఎగుమతుల్లో 46శాతం రాష్ట్రం నుంచే జరుగుతున్నయని,,ఈ రంగాన్ని తగిన విధంగా ప్రోత్సహించాలని అదేశించారు..అలాగే సింగిల్డెస్క్ పద్ధతిలో పరిశ్రమలకు అనుమతుల విధానంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని,,అత్యంత పారదర్శక విధానాల్లో భాగంగా ఈ మార్పులను తీసుకు వచ్చినట్లు పేర్కొన్నారు..విశాఖలో డేటా సెంటర్ త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు..ఎస్ఐపీబీ సమావేశంలో మంత్రులు,అధికారులు,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.