AMARAVATHINATIONAL

నదిలో కొట్టుకుని పోయిన యుద్ద ట్యాంక్,5 గురు సైనికులు మృతి

అమరావతి: చైనా స‌రిహ‌ద్దు ఉన్న న‌దిలో విషాదం చోటుచేసుకున్న‌ది.. యుద్ధ ట్యాంక్(T-72 tank) ఆ న‌దిలో కొట్టుకుపోయింది.. ట్యాంక్ లో అయిదుగురు సైనికులు,,ఇందులో జూనియ‌ర్ క‌మీష‌న్డ్ ఆఫీస‌ర్ ఒకరు ఉన్నారు.. నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద లేహ్‌లో ఉన్న దౌల‌త్ బేగ్ ఓల్డీ ఏరియా వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది.. రెస్క్యూ అధికారులు ఒక‌రి మృత‌దేహాన్ని వెలికితీశారు.. మ‌రో న‌లుగురు గల్లంతయ్యారు..లేహ్ నుంచి 148 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ట్యాంక్ టీమ్ ఉన్న‌ది.. టీ-72 యుద్ధ ట్యాంక్ తో నదిని దాటుతున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా నీటి మ‌ట్టం పెరిగిన‌ట్లు అధికారులు చెప్పారు.. ప్రవాహాం ఉద్రితికి యుద్ధ ట్యాంక్‌తో పాటు సైనికులు కొట్టుకుపోయారు..శుక్ర‌వారం అర్థ‌రాత్రి ఒంటి గంట స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగినట్లు అంచ‌నా వేస్తున్నారు..

భార‌తీయ ఆర్మీ సైనికుల మృతి ప‌ట్ల ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సంతాపం తెలిపారు. దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు త‌న ఎక్స్ అకౌంట్‌లో వెల్ల‌డించారు. దేశం కోసం విరోచిత సేవ‌లు అందించిన ఆ సైనికుల‌ను ఎన్న‌టికీ మ‌రిచిపోలేమ‌న్నారు. బాధిత కుటుంబ‌స‌భ్యుల‌కు ఆయ‌న ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద స‌మ‌యంలో దేశం ఆ కుటుంబాల‌కు అండ‌గా ఉంటుంద‌ని మంత్రి రాజ్‌నాథ్ వెల్ల‌డించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *