AMARAVATHIDISTRICTS

ఉద్దండరాయుని పాలెంలోని శంకుస్థాపన వేదికకు ప్రణమిల్లిన చంద్రబాబు

అమరావతి: రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం తన రెండో క్షేత్ర స్థాయి పర్యటనను ఉండవల్లిలో వైసీపీ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి ప్రారంభించారు.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు అమరావతి రైతులు, మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు.. ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు..ఈ సందర్భంగా ఆయన మోకాళ్లపై కూర్చొని ఉద్దండరాయుని పాలెంలో శంకుస్థాపన వేదికకు ప్రణమిల్లారు.. నీరు-మట్టి సేకరించి ప్రదర్శనకు ఉంచిన ప్రాంతాన్ని సందర్శించి, కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు..రాజధాని నిర్మాణ శంకుస్థాపన శిలా ఫలకాన్ని,,నాడు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన యాగశాలను,, గృహ సముదాయాలను పరిశీలించారు..నిర్మాణం పూర్తైన రూములను చంద్రబాబు పరిశీలించారు.. రాజధాని నిర్మాణ పనుల వాస్తవ పరిస్థితి తనకు తెలియాలని అధికారులకు చెప్పారు..ప్రజా ప్రతినిధుల క్వార్టర్ల నిర్మాణం రూ. 421 కోట్లతో 1,46,240 చదరపు మీటర్లల్లో నిర్మాణం జరుగుతోంది.. చంద్రబాబు వెంట మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు ధూళిపాల్ల నరేంద్ర, కొలికపూడి శ్రీనివాస రావు తదితరులు ఉన్నారు. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *