AMARAVATHI

ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను పెంచి అందించాం-మంత్రి నారాయణ

నెల్లూరు: ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన మాట ప్రకారం గతంలో ఇస్తున్నరూ.3వేలు పింఛన్‌కు రూ.వెయ్యి పెంచి రూ.4వేలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందించారని, దీంతో జులై 1వ తేదీ తెల్లవారుజాము నుంచే పించన్లదారుల్లో ఆనందం కన్పించిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖమంత్రి డాక్టర్‌ పొంగూరు నారాయణ అన్నారు. సోమవారం ఉదయం నెల్లూరు నగరంలోని 13వ డివిజన్‌ పరిధిలోని యనమలవారిదిన్నెలో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి నారాయణ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. యనమలవారిదిన్నె,,జెండావీధి, కపాడిపాళెం, వెంకటేశ్వరపురంలో లబ్ధిదారులకు మంత్రి నారాయణ పెన్షన్లు అందచేశారు.ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో పెంచిన్‌ పింఛన్‌ బకాయిలు రూ.3వేలు, ఈనెల పింఛన్‌ రూ.4వేలు మొత్తం కలిపి రూ.7వేలను అందించడంతో లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేవన్నారు. వికలాంగులకు గతంలో ఇస్తున్న రూ.3వేలను రెట్టింపు చేసి రూ.6వేలు అందించినట్లు చెప్పారు.సీ.ఎం చంద్రబాబు, సెక్రరేటియేట్‌ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులందరూ వెళ్లి లబ్ధిదారులకి ఫించన్లు  పంపిణీ చేయాలని ఆదేశించారన్నారు. నెల్లూరులో సుమారు 8వేల మందితో ఫించన్లు పంపిణీ జరిగిందన్నారు.నూటికి నూరుశాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారని, ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగాన్నిమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. 

Spread the love
venkat seelam

Recent Posts

సీబీఐ కోర్టులో ఉన్న జగన్‌ కేసులను రోజువారీగా విచారించండి-తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసుల పిటిషన్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.. జగన్ కేసులకు…

8 hours ago

తిరుమలలో దళారుల ఏరివేతకు చర్యలు తీసుకోండి – టీటీడీ ఈవో జె.శ్యామలరావు

తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో జె.శ్యామలరావు…

8 hours ago

రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు

నెల్లూరుకు ఒ.ఆనంద్.. అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కలెక్టర్​లను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. శ్రీకాకుళం…

1 day ago

తిరుపతి జిల్లా కలెక్టర్ గా డా.ఎస్. వెంకటేశ్వర్ ఐ.ఎ.ఎస్

తిరుపతి: డైరెక్టర్ సెకండరీ హెల్త్ గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న డా.ఎస్.వెంకటేశ్వర్ ఐ.ఎ.ఎస్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ గా…

1 day ago

రూ.249కి కొత్త ప్లాన్ ప్రవేశ పెట్టిన BSNL

అమరావతి: దేశీయ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ (BSNL) వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఒక కొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది.. దీని…

1 day ago

రూ.10,20 నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం-ఉత్తర్వులు జారీ చేసిన రిజర్వ్ బ్యాంకు

IPC సెక్షన్ 124A... అమరావతి: ప్రభుత్వం గుర్తించిన 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం…

2 days ago

This website uses cookies.