తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న IAS,IPS అధికారులు ఆంధ్రప్రదేశ్ కు బదలీ
హైదరాబాద్: తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న IAS,,IPS అధికారులను ఆంధ్రప్రదేశ్ కేడర్కు కేటాయిస్తూ సంబంధిత అధికారులు వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా కొనసాగుతున్న ఆమ్రపాలి కాట, విద్యుత్ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న రోనాల్డ్ రోస్, వాణిప్రసాద్, వాకాటి కరుణ, మల్లెల ప్రశాంతితో పాటు పలువురు అధికారులను ఆంధ్రప్రదేశ్ కేడర్కు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది..ఈ విషయమై అధికారుల పేరుతో లేఖను పంపిస్తూ,సదరు కాపీలను తెలంగాణ, ఏపీ చీఫ్ సెక్రెటరీలకు కేంద్రం పంపింది..తెలంగాణ కేడర్ కావాలంటూ 11 మంది అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాగా అధికారుల వినతిని కేంద్రం తిరస్కరించింది.. అధికారులంతా సొంత రాష్ట్రంలో 16లోగా రిపోర్ట్ చేయాలని ఆదేశించింది..