మాజీ ఇంటలిజెన్స్ చీఫ్,IPS అధికారి PSR ఆంజనేయులు అరెస్ట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఇంటలిజెన్స్ చీఫ్, IPS అధికారి PSR ఆంజనేయులను విజయవాడ పోలీసులు ఆయనను హైదరాబాదులో మంగళవారం అదుపులోకి తీసుకొన్నారు.. ముంబై నటి,, మోడల్ కాందాంబరి జెత్వానీ ఫిర్యాదుపై పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు..ఈ కేసులో PSR ఆంజనేయులు ఎందుకు అరెస్టు చేయలేదని గతంలోనే హైకోర్టు ప్రశ్నించిన సంగతి విదితమే…తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం తొలి సారిగా జరిగింది.. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా పని చేశారు..అయనపై వచ్చిన ఆరోపణలతో కూటమి ప్రభుత్వం విధుల నుంచి ఆంజనేయులను సస్పెండ్ చేశారు..హైదరాబాద్లోని ఆయన నివాసం నుంచి పోలీసులు ఆంధ్రప్రదేశ్కి తీసుకుని వచ్చారు..జెత్వానీ కేసులో పూర్తిస్థాయిలో సీఐడీ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులుని విచారించనున్నారు.. నటి జెత్వానీపై తప్పుడు ఆరోపణలపై అరెస్టు,,వేధింపులకు పాల్పడినందుకు సస్పెండ్ చేయబడిన కాంతిరాణాటాటా,,విశాల్ గున్నీ,, PSR ఆంజనేయులు..ఈ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులలో ఆయన ఒకరు..ఇదే కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులు క్రాంతి రాణా టాటా, విశాల్ గున్నీ కూడా నిందుతులుగా ఉన్నారు..వారిద్దరికి హైకోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.. ఆంజనేయులు మాత్రం ఇప్పటివరకూ బెయిల్ కోసం అప్పీల్ చేసుకోలేదు.
కేసు నేపధ్యం:- గత ఆగస్టులో ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబుకు జెత్వానీ అధికారికంగా ఫిర్యాదు చేసింది.. ఫిబ్రవరిలో తనపై ఫోర్జరీ,, దోపిడీ కేసు నమోదు చేసిన రాజకీయ నేత,, సినీ నిర్మాత విద్యాసాగర్తో అధికారులు కుట్ర పన్నారని ఆరోపించింది.. సీనియర్ పోలీసు అధికారులు విద్యాసాగర్తో కుమ్మక్కై తనను,, తన కుటుంబాన్ని వేధించారని,, ముందస్తు నోటీసు లేకుండా అరెస్టు చేశారని,, ముంబై నుంచి విజయవాడకు తీసుకువచ్చారని జెత్వానీ ఫిర్యాదు చేసింది..చట్టవిరుద్ధంగా తనను నిర్బంధించారని 40 రోజులకు పైగా జ్యుడీషియల్ కస్టడీలో ఉంచినట్లు పేర్కొన్నారు.