AP&TGMOVIESOTHERS

కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై కేసు నమోదు-గతంలోను కేసులు?

పార్టీకి దూరంగా వుండడండి..

అమరావతి: కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌(షేక్.జానీ భాషా) పై జనసేన పార్టీ చర్యలు చేపట్టింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసు కేసు నమోదైంది..ఈ నేపధ్యంలో జనసేనపార్టీ, ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది..జానీపై రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైన నేపథ్యంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఓ ప్రకటనలో తెలిపింది.. తక్షణం నిర్ణయం అమలులోకి వస్తుందని పార్టీ వేముల అజయ్‌ కుమార్‌ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు..కొంతకాలంగా తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఓ మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులను ఆశ్రయించింది..ఈ క్రమంలో రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్‌పై సెక్షన్‌ 376, 506, 323(2) కింద కేసులు నమోదు చేశారు. కేసు విచారణను నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన బాధితురాలు గత ఆరునెలలుగా జానీ మాస్టర్‌ వద్ద అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నది.. అవుట్‌ డోర్‌ షూటింగ్‌ సమయంలో నార్సింగ్‌లోని తన నివాసంలో తనను పలుసార్లు లైంగిక వేధించాడని బాధితురాలు ఆరోపించింది..చెన్నై, ముంబయి, హైదరాబాద్‌ సహా పలు నగరాల్లో అవుట్‌ డోర్‌ షూటింగ్‌కు వెళ్లిన సందర్భాల్లో వేధింపులకు పాల్పడ్డాడని,, లైంగిక దాడికి పాల్పడడంతో పాటు గాయపరిచాడని, నార్సింగ్‌లోని తన ఇంటికి వచ్చి ఇబ్బందులకు గురి చేసినట్లు ఆరోపించింది.. ప్రతిఘటిస్తే కొట్టి, హింసించేవారు,, మతం మార్చుకుని పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేశారు..అలాగే నా ఇంటికి వచ్చి జానీ మాస్టర్‌ భార్య పలుమార్లు కొట్టారు..సదరు మహిళ 2019 నుంచి జానీ మాస్టర్‌ దగ్గర అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం.. గతంలోను జానీ మాస్టర్‌పై పలు కేసులు నమోదయ్యాయి.. 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్‌ కోర్టు జానీ మాస్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది..గతేడాది జూన్‌లో సతీష్ అనే కొరియోగ్రాఫర్‌ సైతం సినిమాల్లో అవకాశాలు రాకుండా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు..పోలీసు కేసు నేపథ్యంలో జానీ మాస్టర్‌ పరారీలో ఉన్నట్లు తెలుస్తున్నది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *