AP&TG

భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి కన్నూమూత

అమరావతి: భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి(84) శనివారం కాలం చేశారు.. ఆమె గత కొంత కాలంగా వయోభార సమస్యలతో బాధపడుతున్నారు..ఈ క్రమంలో సాయంత్రం ఢిల్లీలో కన్నమూశారు..ఆమె స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లె..1940లో జన్మించిన ఆమె, వేల సంఖ్యలో భరతనాట్య ప్రదర్శనలిచ్చారు.. ఆమె ప్రతిభకుగానూ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, సంగీత నాటక అకాడమీ అవార్డులను అందుకున్నారు..తనకు ఐదేళ్ల వయసులో చెన్నైలోని కళాక్షేత్ర స్కూల్ ఆఫ్‌ డ్యాన్స్‌ లో భరతనాట్యం శిక్షణ తీసుకున్నారు..1957లో మద్రాస్‌లో తొలి ప్రదర్శన ఇచ్చిన తరువాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.. తన ప్రతిభతో టీటీడీ ఆస్థాన నర్తకిగా ఎదిగారు.. భరతనాట్యంలో విశేష ప్రావీణ్యం సంపాదించిన తర్వాత కూచిపూడిలోనూ రాణించారు..శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకొన్నారు..యామినీ కృష్ణమూర్తిని 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్‌, 2016లో పద్మ విభూషణ్‌ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.. యామినీ కృష్ణమూర్తి ఎంతోమంది ఔత్సాహిక యువతులకు నాట్యంలో శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దారు.. దిల్లీలో ‘యామినీ స్కూల్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’ స్థాపించి నృత్యంలో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *