N.M.R & దినసరి ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు-డి.ఆర్.ఓ
నెల్లూరు: జిల్లాలో ప్రభుత్వ సంస్థ ల్లో పనిచేసే N.M.R & దినసరి ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి S.లవన్న అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో ప్రభుత్వ సంస్థల్లో N.M.R,&దినసరి వేతనాల ఉద్యోగులకు కనీస వేతనాల అమలుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా DRO మాట్లాడుతూ జిల్లాలో 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ సంస్థ ల్లో పనిచేసే N.M.R & దినసరి వేతనాల ఉద్యోగులకు వేతనాలు అమలు చేయడానికి కమిటీ నిర్ణ యించిందన్నారు. నైపుణ్యం లేని ఉద్యోగులకు 560 రూపాయలుగా,అర్ధ నైపుణ్యం కలిగిన వారికి 665 రూపాయలు, నైపుణ్యం కలిగిన వారికి 794 రూపాయలు, ఉన్నత స్థాయినైపుణ్యం కలిగిన వారికి 907 రూపాయలువేతనాలు ఇవ్వాలని కమిటీ నిర్ణయించడం జరిగిందన్నారు. కమిటీ నిర్ణయించిన వేతనాలు 2025 మార్చి నెల వరకు అమలులో ఉంటాయన్నారు.అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తమ శాఖల్లో అమలు చేయాలని ఆయన అన్నారు.ఈ సమావేశంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎం.వెంకటేశ్వరరావు, పంచాయతీ రాజ్ ఎస్.ఇ అశోక్ కుమార్, ఆర్&బి ఎస్.ఇ గంగా రావు,బి. ఎస్.ఎన్. ఎల్ జనరల్ మేనేజర్ హరి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.