త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని నరేంద్ర మోదీ
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు..తొలుత ప్రయాగ్ రాజ్ విమానాశ్రయంకు చేరుకున్న ప్రధాని మోదీ,,అక్కడి నుంచి అరైల్ ఘాట్ కు వెళ్లారు..అరైల్ ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు..అనంతరం త్రివేణి సంగమంలో ప్రధాని నరేంద్ర మోదీ పుణ్యస్నానం ఆచరించారు..ప్రధాని నరేంద్ర మోదీ వెంట యూపీ సీఎం యోగీఆదిత్యనాథ్ ఉన్నారు.. యమునా నదిలో స్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులకు బోటు నుంచే అభివాదం చేశారు.. సంగం ఘాట్ వద్ద పుణ్య స్నానం ఆచరించే ముందు గంగమ్మకు ప్రార్దనలు చేశారు.. పుణ్యస్నానం అనంతరం త్రివేణి సంగమం వద్ద మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించి పూజలు చేశారు..సాధు సంతువులతో సమావేశం అయ్యారు.