NATIONALOTHERSWORLD

పసిఫిక్‌ ద్వీపదేశం అయిన వనౌటును భారీ భూకంపం

అమరావతి: పసిఫిక్‌ ద్వీపదేశం అయిన వనౌటును భారీ భూకంపం అతలాకుతలం చేసింది..దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో ఉన్న వనౌటు తీరంలో మంగళవారం ఉదయం అత్యంత శక్తిమంతమైన భూకంపం సంభవించింది.. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 7.3గా నమోదైంది..దేశంలోనే అతిపెద్ద నగరమైన రాజధాని పోర్ట్‌ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు..7.3 తీవ్రత తర్వాత ఇదే ప్రాంతంలో పలు మార్లు 5.3 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదయ్యాయి..భూకంపం ధాటికి ఎత్తైన భవనాలు కొంత మేర ధ్వసం కాగా అనేక ఇళ్లు,,కార్లు దెబ్బతిన్నాయి..పోర్ట్‌ విలాలోని యూఎస్‌, యూకే, ఫ్రాన్స్‌ సహా పలు దేశాల రాయబార కార్యాలయాలు ఉన్న బిల్డంగ్స్ ధ్వంసమైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది..ఈ భూకంపం ధాటికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు సమాచారం వస్తొంది..పూర్తి స్థాయి వివరాలు తెలియరాలేదు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *