NATIONAL

అంతర్జాతీయ సరిహద్దుల వద్ద దేశంలోకి ప్రవేశిస్తున్న 7 మంది ఉగ్రవాదులు హతం-BSF

అమరావతి: భారత్‌-పాకిస్థాన్‌ ఒక వైపు దాడులు జరుగుతుండగా మరో వైపు పాకిస్తాన్ తను పెంచి పోషిస్తూన్న ఉగ్రవాదులను సరిహద్దుల గుండా దేశంలోకి పంపించేందుకు ప్రయత్నించింది..ఉగ్రవాదులను గుర్తించిన BSF వారిని మట్టుబెట్టింది..గురువారం రాత్రి 11 గంటల సమయంలో జమ్ముకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల అక్రమ చొరబాట్లకు అనువుగా పాకిస్థాన్‌ సైన్యం డ్రోన్లు,, చిన్నపాటి మిసైళ్లతో దాడులకు పాల్పడింది.. ఇదే అదనుగా ఏడుగురు ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు యత్నించారు.. గుర్తించిన BSF వారిపై కాల్పులు జరిపి అంతమొందించింది..ఈ విషయంను BSF నిర్ధారించింది.. గురువారం రాత్రి 11 గంటల సమయంలో సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి చొరబాటుకు యత్నించిన వారందరూ జైషే మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు అనుమానిస్తున్నట్లు BSF వర్గాలు వెల్లడించాయి..ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *