గురువారం గరిష్ట ఉష్ణోగ్రతలు 43-44°C నమోదుకు అవకాశం
అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత నానాటికి పెరుగుతొంది. గురువారం గరిష్ట ఉష్ణోగ్రతలు 43-44°C మధ్య నమోదుకు అవకాశం వుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో గరిష్ట ఉషోగ్రత్తలు నమోదుకు అవకాశం.ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బుధవారం రికార్డు ఉష్ణోగ్రతలు:– సంజామల (నంద్యాల): 44.6°C గురజాల (పల్నాడు): 44.5°C నమోదు అయినట్లు పేర్కొంది.

