తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో సత్తా చాటిన అమ్మాయిలు
హైదరాబాద్: ఇంటర్ తుది పరీక్షల ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,, పొన్నం ప్రభాకర్ కలిసి మంగళవారం విడుదల చేశారు.. ఇంటర్ ఫలితాల్లో 65.96 శాతం ఉత్తీర్ణత నమోదైంది..ఇందులో బాలికలు 73.83 శాతం,, బాలురు 57.83 శాతం ఉత్తీర్ణత సాధించారు.. ఫస్టియర్ పరీక్షలకు 4,88,430 మంది హాజరు కాగా 3,22,191 మంది ఉత్తీర్ణత సాధించారు..సెకండియర్లో 65.65 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా బాలికలు 74.21 శాతం,,బాలురు 57.31 శాతం ఉత్తీర్ణత సాధించారు..సెకండియర్ పరీక్షలకు 5,08,582 మంది హాజరు కాగా 3,33,908 మంది ఉత్తీర్ణత సాధించారు.