AP&TG

రాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. సచివాలయంలో రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు సమాచరం..వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించ్చారు..అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు..ప్రమాదానికి గల కారణాలపై భద్రతా సిబ్బంది దర్యాప్తు చేపట్టారు..అగ్నిప్రమాదానికి గల కారణాలపై పై హోం మంత్రి అనిత స్పందిస్తు,,సమగ్ర దర్యాప్తుకు అదేశించారు..

అగ్నిప్రమాదంలో జరిగిన 2వ బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనిత పేషీలు ఉన్నాయి.. ఉదయం అగ్నిప్రమాదం జరగడంతో సిబ్బంది ఎవరూ కార్యాలయం లోపల లేరని సమాచారం.. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *