హైదరాబాద్ లో గంజాయి సగ్మింగ్ల్ చేస్తు పట్టుబడిన అంధ్ర పోలీసులు
అమరావతి: ఈజీ మనీ వస్తొంది అంటే ఎలాంటి పనికైన పోలీసులు దిగజారుతున్నారు అనేందుకు ఉదహరణ… ఆరోగ్యం బాగా లేదని సెలవు పెట్టి మరీ గంజాయి అక్రమ రవాణాకు ఇద్దరు పోలీసులు ప్రయత్నించారు..వీరి టైమ్ బాగ లేక పోవడంతో తెలంగాణ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు..వివరాల్లోకి వెళ్లితే….శుక్రవారం తెల్లవారు జామునా తెలంగాణ బాచుపల్లి సమీపంలో, ముందుస్తు సమాచారంతో బాలానగర్ SOT పోలీసులు AP 39 QH 1763 నెంబర్ గల మారుతీ ఈసీవో వాహనాన్ని తనిఖీ చేయగా, 11 పాకెట్స్ లో 22 కేజీల గంజాయి పట్టుబడింది..వీటి విలువ రూ.8 లక్షలు.. పశ్చిమగోదావరి జిల్లా కాకినాడ 3వ బెటాలియన్ APSPకి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ (సాగర్ పట్నాయక్( 35) ),, కానిస్టేబుల్(శ్రీనివాస్ (32 ) అని తెలంగాణ పోలీసులు నిర్ధారించారు..ఈజీ మనీకి ఆశపడి మొదటిసారి ఈ చెడు మార్గాన్ని ఎనుకున్నట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు..బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు.